స్మార్ట్ ఫోన్స్ లాంటి డిజిటల్ సాంకేతికత మనల్ని శుద్ధ మొద్దులుగా మార్చేస్తున్నది. వాటిమీదే ఆధారపడుతూ సొంత ఆలోచనలను, అభిప్రాయాలను కోల్పోతున్నాం… అన్నది
తీవ్రమైన వాదన. చాలామంది దీన్ని నమ్ముతున్నారు కూడా! అయితే ఆంటొని కెర్మో అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని కొట్టిపారేస్తూ ఓ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఆయన దృష్టిలో సాంకేతిక పరిజ్ఞానం మన మెదడుకి చేస్తున్న కీడు కంటే మేలే ఎక్కువ. ‘ఇదివరకు నిర్ణయాలు తీసుకోవడానికి మెదడు చాలా శ్రమించాల్సి వచ్చేది. అందుకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, దాన్ని విశ్లేషించడం కోసం తన శక్తినంతా వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. జీపీఎస్ లాంటి సౌలభ్యాల వల్ల మెదడు మరింత ముఖ్యమైన పనులు చేసే వెసులుబాటు చిక్కుతోంది’ అంటున్నారు ఆంటొని. ఆలోచించాల్సిన విషయమే!