యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు ఆగమశాస్త్రం ప్రకారం విశేష పూజలు జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్తులను పంచామృ తాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపారు.
దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహా మండ పంలో సుదర్శన నారసింహా హోమం, విశ్వక్సేనారాధన, నిత్యతిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామి వారికి పవళింపు సేవను నిర్వహిం చారు.
సీఎం కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం ఆలయ ఉద్యోగులు సీఎం కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి దేవస్థానంలో పనిచేస్తున్నఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రమేశ్బాబు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.