ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి కృష్ణా జలాలను సాగర్కు వదిలారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.