మదనాపురం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం గాలి పీడనం ద్వారా నాల్గు ఉడ్ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్ తెరుచుకొని సుమారు రెండు గంటల పాటు నీటిని దిగువకు విడుదల చేస్తు పర్యాటకులను కనువిందు చేసింది.
అదేవిధంగా మదనాపురం రైల్వేగేటు సమీపంలో మారెడ్డిపల్లి వాగు ఉదృతంగా ప్రవహించడంతో, కొత్తకోట-ఆత్మకూరు పట్టణాలకు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలించిన రామన్ పాడు ప్రాజెక్టు అధికారులు, రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ రెనాల్ రెడ్డి తెలిపారు.