వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు కానుకలు వేసే హుండీల్లోకి నీరు చేరడంతో అత్యవసరంగా సోమవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. 110 రోజులకు గాను 8,94,362 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో కే. రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కిరణ్రెడ్డి, సర్పంచ్ కొత్త నర్సింహ, పర్యవేక్షణ అధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.