ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారు మూల నక్షత్రమున నిజ రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకు లు భువనచంద్ర అమ్మవారికి సుప్రభాతసేవ, తిరువరాధన, కుంకుమార్చన, నైవేద్య నిరాజనాలు నిర్వహించారు.
మూల నక్షత్రాన్ని పురష్కరించుకొని అమ్మ వారి భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం గావించారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్రాజు పర్యవేక్షించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో అమ్మవారు సరస్వతి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు.