హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.