హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా ముసురు కమ్మేసింది. చిరుజల్లులతో తడిసి ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు వీనులవిందు చేస్తున్నాయి. దీంతో నగరవాసులు సినుకుల్లో తడుస్తూ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సంబురపడిపోతున్నారు. ఇక భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు మత్తడి దుంకుతున్నాయి. జలపాతాలు జాలువారుతున్నాయి. వీటిని చూసేందుకు కూడా పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.