అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మంగ ళవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 29,131 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 28,771 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎం సీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పరవళ్లు
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పరవళ్లు తొక్కుతోంది. టీబీ డ్యాం నుంచి 10 గేట్ల ద్వారా దిగువకు వరద విడుదల చేస్తుండటంతో మంగళవా రం ఆనకట్టకు 30,387 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 29,800 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి వరద చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10.2 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 587 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.