కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నా రు. శనివారం కల్వకుర్తి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించనున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలవడంతో ఐక్యరాజ్యసమితితో తెలంగాణ ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. దీంతో యావత్ భారత్దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ యే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు లాలూయాదవ్, అంజియాదవ్, రుక్కులు, లక్ష్మయ్య, తిరుపతయ్య, ప్రదీప్, పర్వతాలు, కేశవులు తదితరులు పాల్గొన్నారు.