జోగులాంబ గద్వాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తున్నది. అయితే కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం హరితహారంలో నాటిన మొక్కలను తొలగిస్తున్నార. అలాంటి వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది.
తాజాగా జిల్లోని ఐజ పట్టణంలో దవాఖాన ప్రచార బోర్డుకు అడ్డువస్తున్నాయని అలిమియో హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం హరితహారం చెట్లను తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్ యాజమాన్యానికి రూ. 50,000 జరిమానా విధించి బోర్డ్ ను తొలగించారు.