నారాయణపేట, జూలై 30 : కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తున్నందువలన జిల్లాలో కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ చేతన తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నది పరీవాహక ప్రాంతాలై న మాగనూర్, కృష్ణ, మక్తల్ మండలాల్లోని తీర ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాం తాలకు తరలించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రతి గ్రామంలో దండోరా వేయించాలన్నారు. పశువులను పంట పొలాల్లో ఉంచరాదని, నది దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరాదని ప్రజలకు సూచించారు. అధికారులు మెడికల్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను, అవసరమైన బోట్ల ను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు క లుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
జాగ్రత్తగా ఉండాలి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తి నిండుకుండలా ప్రవహిస్తున్నది. శుక్రవారం మండలంలోని గుడెబల్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వాసునగర్ ప్రజలను రెవెన్యూ అధికారులు ఖా ళీ చేయిస్తున్నారు. నదీతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, పరీవాహక ప్రాంతాల ప్రజలు ఎవరూ నది వైపు వెళ్లరాదని హెచ్చరించారు. నది ఉధృతంగా ప్రమాద స్థాయి కి చేరితే వెంటనే ప్రజలను ఖాళీ చేసే విధంగా సిద్ధంగా ఉం డాలని, ఆ విధంగా చర్యలు చేపట్టాలని తాసిల్దార్ సురేశ్ అధికారులకు సూచించారు.
తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే ని వాసంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి డ్యామ్ల నుంచి అధికం గా వరద నీరు జూరాలకు పోటెత్తడంతో కృష్ణ, మాగనూ ర్, మక్తల్ మండలాలకు చెందిన గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీ స్, రెవెన్యూ అధికారు లు ప్రజలను నదీతీర ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదన్నారు. లో తట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులతో నది ప్రవాహం గురించి తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.