ఇటిక్యాల: తెరాస పార్టీ 20 ఏండ్ల జైత్రయాత్రలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని తెరాస శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం నాయకత్వంలో నియోజకవర్గంలోని
ముఖ్య నాయకులు కార్యకర్తలు గులాబీ రంగు దుస్తులు ధరించి మండలంలోని జింకలపల్లె స్టేజీ సమీపంలోని తెరాస పార్టీ కార్యాలయ ఆవరణలో సమావేశమైన వీరు వివిధ వాహనాలలో హైదరాబాద్కు బయలు దేరి వెళ్లారు.