మానవపాడు : తాసీల్దార్ కార్యాలయంలో మంటలుఅ అంటుకుని రికార్డులు దగ్దమైన ఘటనలో విచారణ వేడవంతం చేయాలని ఎమ్యెల్యే అబ్రహం ఎస్సై సంతోష్ను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయా న్ని ఆయన సందర్శించారు. ఘటన జరిగిన తీరును తాసీల్దార్ వరలక్ష్మిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజల ఆస్తిపాస్థులకు సంబంధించిన దస్ర్తాలు మొత్తం కాలి బూడిద కావడం చాలా బాదాకరమని అన్నారు. కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన వివరాలు కోట్లు వెచ్చించినా తిరిగి రావడం కస్టమన్నారు. తాసీల్దార్ కార్యాలయంలో ప్రమాదం ఎలా జరిగిందో విచారణ వేగవంతం చేయాలని ఎస్సై సంతోష్ను ఆదేశించారు. అనంతరం ప్రజలు ఎమ్యెల్యేతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని విన్నవించారు.
సమయం 5 గంటలు దాటితే ఉండని సిబ్బంది ఆదివారం సెలవు రోజు కూడా కార్యాలయాన్ని తెరిచి పనులు చేసుకు న్నారని ఎమ్యెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే ఒక ప్రైవేటు వ్యక్తికి రికార్డు గది తాలాలు అప్పగించారని, జూనియర్ అసి స్టెంట్ సెలవు మంజూరు లేకుండా డుమ్మా కొట్టి రికార్డు గది తాలాలు ఇవ్వడంపై అను మానాలు ఉన్నాయని తెలిపారు. సిబ్బందిలో సఖ్యత లేదని ఎవరికి వారే ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఎమ్యెలేకు ఫిర్యాదు చేశారు.
విచారణ ప్రారంభించాం: ఎస్సై సంతోష్
తాసీల్దార్ కార్యాలయంలో మంటలు రేగి రికార్డులు కాలిపోయిన గటనలో విచారణ ప్రారంభిచించామని ఎస్సై సంతోష్ తెలిపారు. విద్యుత్తుశాఖ అధికారులకు, ఫైర్ సర్వీస్ వారికి , తాసీల్దార్ వరలక్ష్మికి ఘటనకు సంబంధించిన కారణాలు తెలపాలని సూచించామన్నారు. అలాగే కార్యాలయంలో సిబ్బంది మధ్య ఉన్న సంబంధాల గిరించి ఆరా తీస్తున్నామ న్నారు. ఘటకు సంబంధించిన కారణాలను త్వరలోనే చేధిస్తామన్నారు.