జోగులాంబ గద్వాల : ఇటిక్యాల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో 290 కొత్త రేషన్ కార్డులను ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులందరికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్స్ సరిత, జెడ్పీటీసి హానుమంతు రెడ్డి, స్థానిక సర్పంచ్ సరోజమ్మ, సింగల్ విండో అధ్యక్షుడు రంగ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయచంద్రా రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గిడ్డ రెడ్ద్, వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు, టెంపుల్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం