జోగులాంబ గద్వాల : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని సివిల్ సప్లయ్స్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు. ఆలయ సిబ్బంది శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈ. రవి ప్రకాష్ గౌడ్, ఈవో వి ప్రేమ్ కుమార్ రావు, పాలక మండలి సభ్యులు, వెంకట్రామయ్య శెట్టి, ఆలయ అర్చకులు డి. ఆనంద్ శర్మ, డి. కృష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు.