మహబూబ్నగర్/టౌన్, మే 16 : మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ను తలమానికంగా నిర్మిస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారా మం తదితర పనులన్నీ పూర్తయితే ఆహ్లాదకరంగా ఉం టుందన్నారు. లక్నవరం తరహాలో సస్పెన్షన్ బ్రిడ్జి ఏ ర్పాటు చేస్తామన్నారు. హెలీపాడ్ రెస్టారెంట్లతో అత్యం త అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు దశల వారీగా పనులు చేపడుతున్నామన్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, చిల్డ్రన్స్ పార్కువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర జిల్లాల నుం చి కూడా పర్యాటకులు వచ్చేలా అద్భుతంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ట్యాంక్బండ్ ప నులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
పట్టణానికి సెంట్రల్ లైటింగ్ శోభ..
జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసి న సెంట్రల్ లైటింగ్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పా లమూరు రూపురేఖలు మారుస్తామన్నారు. రోడ్డు విస్తరణ చేపట్టామని, ఎక్కడా సమస్యలు లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఆ కాశమంత వెలుతురుతో ప్రతి రోజూ పండగ వాతావరణంలో పట్టణం వెలుగుతుందన్నారు. ఆయా కా ర్యక్రమాల్లో అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, టూరిజం ఎండీ మనోహ ర్, ఐబీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రధర్, డీఈ మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రాము, గోవింద్, నర్సింహులు, నాయకులు శివరాజ్, మోసిన్, చిన్న, జావిద్బేగ్ పాల్గొన్నారు.