మహబూబ్నగర్, జూలై 15 : ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కురిణిశెట్టికాలనీకి చెందిన రాకేశ్కు గురువారం హైదరాబాద్లో రూ.లక్షా 50వేల సీఎం సహాయ నిధి చెక్కు అందజేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం తదితర కా రణాలతో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పేదలను ప్రభు త్వం సీఎం సహాయ నిధితో అన్నివిధాలా ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వై ద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.