మహబూబ్నగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : సకాలంలో వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు నిండడంతో ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆనం దం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చే సే చేపపిల్లలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చేప పిల్లల కోసం టెండర్లు ఖ రారు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,834 చెరువుల్లో 9.28 కోట్ల చేప పి ల్లలను వదలగా.. ఈ ఏడాది 5,090 చెరువుల్లో 12.29 కోట్లు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏ డాది చేప పిల్లలను అధికంగా వదలడంతోపాటు చెరువుల సంఖ్య సైతం భారీగా పెరిగింది. దీంతో మత్స్య సంపద మరింతగా పెరిగి మత్స్యకారులు ఆర్థికంగా స్వ యం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి ఏడాది చేపపిల్లలు, చెరువుల సంఖ్యను పెంచుతూ పాలమూరులో నీలి విప్లవం తీసుకొచ్చేందు కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అ వుతున్నాయని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జోగుళాంబ గద్వాలలో..
నీలి విప్లవం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2018-19లో 60 చెరువుల్లో 59 లక్షల చేప పిల్లలు వదలగా.. 2019-20లో 116 చెరువుల్లో 1.02 కోట్లు వదిలారు. 2020-21లో 146 చెరువుల్లో 1.15 కోట్లు వదిలారు. ఈ ఏడాది ఏకంగా 400 చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు అధికారులు రంగం సి ద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ 2.43 కోట్లు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబ్నగర్లో..
మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది 1,410 చెరువుల్లో 2.56 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మత్స్యశాఖ డీడీ రాధారోహిణి తెలిపా రు. ఇందుకోసం రూ.1.77 కోట్లను ఖర్చు చేస్తున్నారు. 2017-18లో 874 చెరువుల్లో 2.60 కోట్లు, 2018-19లో 185 చెరువుల్లో 1.18 కోట్లు, 2019-20లో 505 చెరువుల్లో 1.34 కోట్లు, 2020-21లో 832 చె రువుల్లో 1.99 కోట్ల చేప పిల్లలు వదిలారు. ఒకప్పుడు చేపలకు ఎంతో ఇబ్బంది పడిన మహబూబ్నగర్ జిల్లా వాసులకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేపలు లభిస్తున్నాయి. మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్నది.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో 2016-17లో 89 చెరువుల్లో 59 లక్షల చేపపిల్లలు వదలగా.. 2020-21లో 658 చెరువుల్లో 2.03 కోట్ల చేప పిల్లలు వదిలారు. జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, జూరాల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది ఏకంగా 1,076 చెరువుల్లో 2.50 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కాంట్రాక్టర్లు కక్కుర్తి పడితే నిలదీయాలి..
మత్స్యకారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అయితే కొందరు కాంట్రాక్టర్లు, అధికారుల తీరుతో మత్స్యకారు లు ఇబ్బందికి గురవుతున్నారు. నిబంధనల మేరకు ఉం డాల్సిన దాని కంటే చిన్న సైజులో చేప పిల్లలను అం దించడంతో అవి త్వరగా పెరగక లాభాలు రావడం లేద ని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే, చెరువులో చేప పిల్లలను వదిలే సమయంలో నిబంధనల మేరకు చేపల సైజు ఉన్నదో లేదో మత్స్యకారులు చెక్ చేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారులు, సిబ్బంది సైతం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యకారుల సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాం ట్రాక్టర్లు కక్కుర్తి పడితే నిలదీసే హక్కు మత్స్యకారులకు ఉంది. అలా నిలదీస్తేనే నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
మోతాదుకు మించి వదలొద్దు..
చెరువుల్లో మోతాదుకు మించి చేప పిల్లలను వదలొ ద్దు. కాంట్రాక్టర్ చేప పిల్లలను వదిలేటప్పుడు చేపల సైజును తప్పనిసరిగా పరీక్షించాలి. సై జులో తేడా ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలి. చేప పిల్లలకు తాజా ఆక్సిజన్ అందేందుకు చెరువుల్లోకి పశువులను వదలాలి. పశువుల పేడతో పాచి (ప్లాంక్టన్) ఉత్పత్తి పెరిగి చేపలకు ఆహారం లభిస్తుంది.
దళారులను నమ్మి మోసపోవద్దు..
చేపపిల్లల విడుదల చేపట్టే అంశాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నది. స్థానికంగా మత్స్య సంపద పెరిగి వినియోగదారులుకు చేపల లభ్య త కోసం, మత్స్యకారులకు ఉ పాధి కల్పించేందుకు ప్రభు త్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. కానీ, దళారులు చెరువులను లీజుకు తీసుకొని మత్స్యకారులను మోసం చేస్తున్నారు. మత్స్యకారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు.
చేపల వేటతో ఉపాధి..
చెరువులు, కుంటలు నిం డుకుండలను తలపిస్తున్నా యి. మత్స్యశాఖ ఆధ్వర్యం లో ప్రభుత్వం ఏటా ఉచితం గా చేప పిల్లలు వదులుతున్న ది. మండలంలో గతేడాది 11 లక్షల చేపపిల్లలు వదల గా, ఈ ఏడాది 13 లక్షలు టార్గెట్గా విధించుకున్నారు. 9 వేలకు పైగా ముదిరాజు కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. స్థానికులకు తాజాగా చౌక ధరకే చేపలు లభిస్తున్నాయి.