కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి, ఆగస్టు 3: కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నెలరోజుల్లో కూరగాయల మార్కెట్ పనులు పూర్తికావాలన్నారు. ఆయా వార్డుల్లో చేపట్టిన డ్రైనేజీ, సీసీరోడ్డు నిర్మాణ పనులు 15రోజుల్లో పూర్తిచేయాలని, అందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎస్ఈ, డీఈ, ఏఈలను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. నెలరోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు చేపట్టాలన్నారు. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. అనంతరం పీఏసీసీఎస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాష్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, నాయకులు రాజేశ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.