గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 3 : మండలంలోని సా లార్నగర్ ప్రాజెక్టు మరమ్మతుకు ప్రభుత్వం రూ.2.8కోట్లు కేటాయించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం సాలార్నగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రాజెక్టు నుంచి పెద్దవార్వల్, చిన్నవార్వల్ గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా మారుతుందన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గండీడ్లో ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21మందికి రూ.5,74,600 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పొందే పేదలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని తెలిపారు.
జానంపల్లి రోడ్డుకు మరమ్మతు
ఇటీవల కురిసిన వర్షాలకు గండీడ్ నుంచి జానంపల్లికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సొంత ఖర్చుతో రోడ్డుకు మరమ్మతు చేయించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ వెంకటయ్య, సర్పంచులు చంద్రకళ, రాఘవేందర్, నాయకులు రాంచ్రందారెడ్డి, అశోక్గౌడ్ సుదర్శన్రావు, బొక్క రాములు, కొండారెడ్డి, భగవంతుగౌడ్, రమేశ్రెడ్డి, జోగు కృష్ణ, బంటు సాయిలు, ఉప్పరి గోపాల్, రమేశ్రెడ్డి, పెంట్యానాయక్, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.