నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు పూర్తయిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా హాబిటేషన్లు, మున్సిపాలిటీల వార్డుల వారీగా శుక్రవారం నుంచి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ప్రత్యేక వ్యా క్సినేషన్ కార్యక్రమంపై జెడ్పీ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, లైన్ డిపార్మెంట్ అధికారులతో వీసీ నిర్వహించగా మంత్రి హనుమకొండ కలెక్టరేట్ నుంచి మాట్లాడారు.
సూక్ష్మ ప్రణాళిక రూపొందించాం
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వర కు 18 ఏండ్లు పూర్తయిన 50శాతం మందికి వ్యాక్సిన్ వేశా మని, మిగతా వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించడం కోసం సూక్ష్మ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్మెంట్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వందశాతం టీకా పూర్తి చేస్తామన్నారు.
టీకా వేయించేలా చర్యలు
జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ మాట్లాడు తూ గ్రామ పంచాయతీల్లో వార్డు సమావేశా లు నిర్వహించి వ్యాక్సిన్ వేయించుకొని వా రికి టీకా వేయించేలా చర్యలు చేపడుతామ ని చెప్పారు. కార్యక్రమంలో వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ రిజ్వి, పంచాయతీరా జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వైద్యశాఖ అధికారి రామ్మనోహర్రావు, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, డీఐవో శైలజ, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్
రాష్ట్రంలో 2కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, కలెక్టర్ హరిచందన కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చే శారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, యువత సహకారంతో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, డీఐవో శైలజ తదితరులు పాల్గొన్నారు.