ఆత్మకూరు, సెప్టెంబర్ 14 : జూరాల ప్రాజెక్టు కు వరద ఉధృతంగా వస్తున్నది. ఎగువన కురుస్తు న్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయ ర్లు పూర్తి నీటిమట్టం సామర్థ్యం చేరుకోగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూ ర్ నుంచి 20 గేట్ల ద్వారా 1,20,800 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. మంగళవారం సా యంత్రం జూరాల ప్రాజక్టుకు 93 వేల క్యూసెక్కు ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 19 గేట్లను ఎత్తి 75,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎ డమ, కుడి, సమాంతర కాలువలు, భీమా-2 లిఫ్ట్ కు నీటి విడుదల కొనసాగుతున్నది. 31,365 క్యూసెక్కులతో ఎగువ, దిగువ జలవిద్యుత్ కేం ద్రాల్లో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నా రు. ఎగువ జూరాలలో మంగళవారం 9.927 మి.యూ, దిగువ జూరాలలో 4.665 మి.యూ. ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.107 టీ ఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 1,10, 618 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
టీబీ డ్యాంకు పోటెత్తిన వరద..
అయిజ, సెప్టెంబర్ 14 : కర్ణాటకలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం ఇన్ఫ్లో 38,562, అవుట్ఫ్లో 36,854 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో డ్యాం 10 గేట్లు ఒకటిన్నర అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 100.470 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఎగువ నుం చి వరద ఉధృతంగా చేరుతుండడంతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని నదీతీర ప్రాంతాల అ ధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ప్ర జలు నది సమీపంలోకి వెళ్లొద్దని కోరారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. 20,631 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 20,200 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 9.5 అడుగుల మేర నీటి మట్టం ఉందని, ప్రధానకాల్వకు 433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కోయిల్సాగర్ ఒక గేటు ఎత్తివేత
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 14 : మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఎ గువ నుంచి స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఒక గేటు ఎత్తి 300 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 32.6 అడుగులు (2.27 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 32.5 అడుగులు (2.25 టీఎంసీలు) ఉన్నది.
శ్రీశైలానికి పెరుగుతున్న వరద..
శ్రీశైలం, సెప్టెంబర్ 14 : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పె రుగుతున్నది. మంగళవారం సాయంత్రం రిజర్వాయర్కు 1,28,863 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 55వేల క్యూసెక్కులను సాగర్కు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 202.04 టీఎంసీలు నిల్వ ఉన్నది.