కోస్గి, సెప్టెంబర్ 14 : వార్డుస్థాయి నుంచి టీఆర్ఎస్ పా ర్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని కొడంగల్ ఎ మ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ము న్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో నాయకులతో కలిసి పార్టీ జెండావిష్కరణచేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పేర్కొన్నా రు. కష్టపడిన కార్యకర్తను పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నూతనంగా వార్డుస్థాయి నుంచి ఎన్నికైన పార్టీ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పని చేయాలన్నారు.
పార్టీలో చేరిన యువకులు
మున్సిపాలిటీ 9వ వార్డు యువకులు ఎమ్మెల్యే సమక్షం లో పార్టీలో చేరారు. ఆయాపార్టీల యువకులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అభివృద్ధి పనులను చూసి యువకులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
మండపాల్లో ప్రత్యేక పూజలు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాల్లో టీఆర్ఎస్గణనాథులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూర్వాడలో ప్రతిష్ఠించిన అతిపెద్ద గణనాథుడికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని అన్ని వినాయక మండపాలను దర్శించుకున్నారు. అనంత రం బిజ్జారంలో నూతనంగా నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు హన్మంత్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.