నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 14 : తెలంగాణ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అసోసి యేషన్ (టీటా) ద్వారా అందజేస్తున్న కో డింగ్ సబ్జెక్టులో శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ ముక్తలతోపాటు కలెక్టర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు, ఆధునాతన అంశాల్లో పట్టు సాధించేందుకు శిక్షణ ఉపయోగపడుతున్నదన్నారు. జిల్లాలో 2,013 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు నూతన నై పుణ్యాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 61 పాఠశాలలను ఎంపిక చేసుకొని 183 భా గస్వాములను గుర్తించినట్లు ఆమె చెప్పారు. వీరు నేరుగా శిక్షణ పొంది తదుపరి ఒక్కో పాఠశాలలో 30 మందికి శిక్షణ ఇవ్వనున్నారన్నారు. విద్యార్థు లు, ఉపాధ్యాయులు కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకొని తదుపరి దశలో తమ తమ పాఠశాలల్లోని వి ద్యార్థులకు సైతం అదే ఒరవడిలో తీర్చిదిద్దాలని ఆమె చెప్పారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ ముక్తల మాట్లాడుతూ కోడింగ్ శిక్షణలో స్క్రాచ్, ఫైథాన్ కోర్సులను నేర్పనున్నట్లు, టీఎస్టీఎస్ ఈ కోర్సుకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. వె నుకబడిన జిల్లాకు చెందిన సర్కారు బడుల విద్యార్థులకు శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో లియాఖత్ అలీ, విద్యాసాగర్, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.