మహబూబ్నగర్, ఆగస్టు 17 : లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలపై హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో లైంగికదాడి జరిగిందని పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి స్పందించారు. స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి సూపరింటెండెంట్ రాజారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులను కలిశారు. నిందితులను శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మహిళల కోసం షీ టీంలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హోం మంత్రి కార్యాలయంలో హోం మంత్రి మహమూద్అలీతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, డీసీపీ కల్మేశ్వర్, రాజారావులతో సమావేశమయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, వేగంగా పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆధునిక హంగులతో బడ్జెట్ హోటల్ నిర్మాణం..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి అవసరమైన చర్య లు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పట్టణంలో ప్రజలు, పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా హోటల్ను ఆధునిక హంగులతో నిర్మించాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
అలంపూర్ క్షేత్రాన్ని యాత్రికుల సౌలభ్యం కోసం మరింత అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ కమిటీ కోరింది. ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్, ధర్మకర్త ఇల్లూరి వెంకట్రామయ్యశెట్టి, టీఆర్ఎస్ నాయకులు బైరాపురం రమణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ను మం గళవారం కలిశారు. హైదరాబాద్లో మంత్రి చాంబర్లో కలిసి జోగుళాంబ దేవి చిత్ర పటాన్ని బహూకరించారు. అంతకు ముందుకు వారు యాదాద్రి నరసింహ స్వామి ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లో మంత్రిని కలిశారు.