మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 17: పట్టణకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలపై అధికారులు, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పేర్కొన్నారు. పట్టణంలోని రామయ్యబౌలి, బీకేరెడ్డికాలనీ, తూర్పుకమాన్ పలు ప్రాంతాల్లో మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పుకమాన్ రోడ్డుపై నీరు నిలువడంతో తొలగించేందుకు సిబ్బంది చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. షాసాబ్గుట్ట చౌరస్తా నుంచి ఎన్పీ సుబ్బారెడ్డి స్కూల్వరకు సీసీరోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. సీసీ వేయనిచోట నీరు నిలుస్తుందని ప్రజలు గమనించాలని కోరారు. వర్షం తగ్గిన తర్వాత పనులు పూర్తిచేస్తామన్నారు. చైర్మన్ వెంట పారిశుధ్య విభాగ అధికారి సయ్యద్ మొహియోద్దీన్, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
పార్కు పనులను పరిశీలించిన
అడిషనల్ కలెక్టర్
పట్టణంలోని శ్రీనివాస్కాలనీ పార్కు, జనరల్ దవాఖాన ఆవరణలో చేపడుతున్న పార్కు పనులను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు పారిశుధ్య విభాగ అధికారి మొహియోద్దీన్తో కలిసి రాయయ్యబౌలి అలుగును పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈ విజయ్భాస్కర్రెడ్డి, డీఈవో, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.