ఊర్కొండ, జూలై30: తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు ఎనలేనివని, ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అన్నారు. మండలంలోని రాచాలపల్లి గ్రామంలో తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో మహాకవి సినారె కళాపీఠం అధ్యక్షుడు మల్లెకేడి రాములు ఆధ్వర్యంలో సినారె జయంతిని నిర్వహించారు. సినారె సాహిత్య పురస్కారాలతో పాటు ‘జనహితం’ పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథులుగా నందిని సిధారెడ్డి, డా.ఓలేటి పార్వతీశం హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. విశ్వంబర కావ్యానికి జ్ఞాన్పీట్ అవార్డు వరించిందన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత సినారెదని, నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు. సినీగేయ రచయితతో పాటు కవిగా అన్ని రంగాల్లో ప్రతిభ కల్గిన మహనీయుడన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు సినారె అని, తాను ఎదగడానికి సినారె జీవితం ఆదర్శమన్నారు. సినారె స్ఫూర్తితో రేడియోల్లో ఆయన కవితలను వింటూ తాను కవిగా మారానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, కె.బాలస్వామి, భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య, గద్వాల కిరణ్కుమారి, కొమ్మగోని శ్రీనయ్యకు సాహిత్య పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోపాల్రెడ్డి, ఎంపీపీ రాధాజంగయ్య, వైస్ ఎంపీపీ అరుణ్కుమార్రెడ్డి, కో ఆప్షన్ ఖలీమ్పాషా, సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిరినాయక్, ఊర్కొండ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు శ్రీధర్రెడ్డి, అమరేశ్వర్రెడ్డి, పరశురాములు, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.