ఆత్మకూరు, జూలై 30 : కృష్ణమ్మ ఉగ్రరూపం దా ల్చింది. కర్ణాటకలోని డ్యాంల నుంచి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం 4.51 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. రాత్రి 9 గంటల కు 4,66,800కు చేరింది. దీంతో 47 గేట్ల ద్వా రా 4,70,990 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. దీంతో ఉరకలేస్తూ కృష్ణమ్మ శ్రీశైలానికి పరుగులు పెడుతున్నది. ప్రాజెక్ట్ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 6.401 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మొ త్తంగా 4,74,113 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. వరద ఉధృతి కారణంగా కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, కోయిల్సాగర్ ఎత్తిపోతలకు 630, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 150, భీమా-2కు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. లిఫ్ట్లకు, కాలువలకు పూర్తి సామర్థ్యంతో పంపింగ్ కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వే టకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రత్యేక వీడియో సందేశాన్ని సా మాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.
టీబీ డ్యాంకు నిలకడగా..
అయిజ, జూలై 30 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శివమొగ్గ జిల్లాలోని గాజనూరు వద్ద ఉన్న తుంగ డ్యాం నుంచి 14,809 క్యూసెక్కుల నీటిని టీబీ డ్యాంకు విడుదల చేస్తున్నారు. కాగా, శుక్రవారం టీబీ డ్యాంలోకి 37,543 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉన్నది. 10 క్రస్ట్ గేట్లు 1.5 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు 26,999 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నా రు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్ర స్తుతం 99.047 టీఎంసీలు నిల్వ ఉన్నాయి .
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. శుక్రవా రం 74,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 74,450 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నాయి. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 12 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
సుంకేసుల @ 10 గేట్లు..
రాజోళి, జూలై 30 : సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతున్నది. శుక్రవారం ఎగువ నుంచి 30 వేల క్యూసెక్కులు రాగా డ్యాం 10 గేట్ల ద్వారా 29 వేల క్యూసెక్కులు నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మరో రెండ్రోజులు వరద కొనసాగే అవకాశం ఉన్నదని, మత్స్యకారులు నదిలోకి దిగొద్దని సూచించారు.
శ్రీశైలంలో జలసవ్వడి..
శ్రీశైలం, జూలై 30 : శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షలకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో శనివారం మధ్యా హ్నం వరకు పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. వరద పెరగడంతో సాయంత్రం పది గే ట్లను 20 అడుగుల ఎత్తు తెరిచి నీటిని దిగువకు వదిలా రు. రెండు, మూడు రోజులు వరద ఉధృతి ఇలాగే కొనసాగొచ్చని అధికారులు భావిస్తున్నారు. రాత్రి 9 గంటలకు జూరాల నుంచి 4,70,990, సుంకేసుల నుంచి 39,170 .. మొత్తం 5,10,160 క్యూసెక్కులు శ్రీశైలం వైపు పయనిస్తున్నాయి. కాగా, శ్రీశైలం ప్రాజెక్టులో 4,86,330 క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. పది గేట్ల నుంచి 4,70,460, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 30,710, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 25,426.. మొత్తం 5,26,596 క్యూసెక్కులు సాగర్కు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్ర స్తుతం 209.1579 టీఎంసీలు ఉన్నాయి.