భూత్పూర్, మార్చి 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానున్నదని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగు ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి రూ.3లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, ఎంపీడీవో మున్ని, పీఆర్ ఏఈ అభిషేక్, సర్పంచ్ కమలమ్మ, ఎంపీటీసీ ఊశన్న, ఉపసర్పంచ్ సుక న్య, మనెమోని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బడుల బలోపేతానికి సహకరించాలి
జడ్చర్లటౌన్, మార్చి 11 : ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల బలోపేతానికి అందరూ సహకరించాలని జెడ్పీ సీఈవో జ్యోతి కోరారు. జడ్చర్ల మండలం మాచారం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అనంతరం మన ఊరు-మన బడి కార్యక్రమంపై ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్, ఎంఈవో మంజులాదేవి, సర్పంచ్ రవీందర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి ఉన్నత పాఠశాల, నిమ్మబావిగడ్డ తెలుగు, ఉర్దూమీడియం పాఠశాలలను జెడ్పీ డిప్యూటీ సీఈవో మొగులప్ప సందర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతిగదులు, ఫర్నీచర్, మూత్రశాలలు, ఆటస్థలాల ఏర్పాటు అంశాలపై సమీక్షించారు. కార్యక్రమాల్లో ము న్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ సునీత, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కోయిలకొండ, మార్చి 11 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కేశ్వాపూర్ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనుల వివరాల ను తెలుసుకున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ మొగులయ్య, ఎంపీడీవో జయరాం, నాయకులు రాజవర్ధన్రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థ మరింత పటిష్టం
మూసాపేట, మార్చి 11 : మనఊరు – మనబడి కార్యక్రమంతో విద్యావ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని కాటవరం, శాఖాపూర్, తిమ్మాయిపల్లితండా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో తరగతిగదులు, మూ త్రశాలలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్బోర్డులు, ప్రహరీ, కిచెన్షెడ్లు, డైనింగ్హాల్స్తోపాటు డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవసరముందని గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మం జుల, ప్రత్యేకాధికారి కృష్ణ, ఎంఈవో నాగయ్య, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 11 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఏఈ నందూనాయక్ సూచించారు. బాలానగర్ బాలికల ఉన్నత పాఠశాల, మోతీఘనపూర్, గంగాధర్పల్లి ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను తెలుసుకున్నారు. కా ర్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీదేవి, హెచ్ఎంలు భారతి, అనురాధ, పాండురంగారెడ్డి, సర్పంచ్ మాలతి, యాదిరెడ్డి పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
చిన్నచింతకుంట, మార్చి 11 : మండలంలోని పర్దీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేపట్టాల్సిన పనులపై చర్చించి తీర్మా నం చేశారు. సమావేశంలో ఎంఈవో లక్ష్మణ్సింగ్, ఏఈ కురుమూర్తి, సర్పంచ్ కోట సుప్రియ, ఉపసర్పంచ్ రవి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ రవి, హెచ్ఎం విజయ్కృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజేశ్వరి ఉన్నారు.