మహబూబ్నగర్, మార్చి 7 : ప్రభుత్వ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉ న్న ప్లాట్లను సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పట్టణంలోని జి ల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్లాట్లకు సంబంధించి డీడీలు చె ల్లించి ఓపెన్ యాక్షన్లో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ప్లాట్లు లేని వారికి అవకాశం ఎంతో ఉపయోపడుతుందని తెలియజేశారు. ఎ లాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకొని ప్లాట్ల ను సొంతం చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో చిన్నారులకు వేయనున్న మిషన్ ఇంద్ర ధను ష్ 4.0 టీకాలు ఏడాది లోపు చిన్నారులకు అందించాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభు త్వ దవాఖానల్లో టీకా అందుబాటులో ఉందన్నా రు. వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొ న్నారు.
ప్రతి విషయం తెలుసుకోవాలి
ప్రతి విషయాన్ని సమగ్రంగా తెలుసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్కు 30 మంది ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్ఎస్, ఇండియన్ పోస్టల్, ఇన్కంట్యాక్స్ అధికారులు వివిధ అంశాలను అధ్యాయనం చేసేందుకు విచ్చేశారు. వారితో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాముఖ్యత ప్రాంతాల వివరాలను తెలియజేశారు. గ్రా మీణ ప్రాంతాల్లోని జీవన విధానాలను పూర్తిస్థాయిలో అధ్యాయనం చేయాలని సూచించారు. ఆరు గ్రామాలను కేటాయింపు చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబందింత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.