వనపర్తి, మార్చి 6 : అన్నిరంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ వారి అభివృద్ధి దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు గుర్తు చేశారు. మహిళాబంధు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములుకు పట్టణ మహిళా నాయకురాళ్లు, ఆర్పీలు రాఖీలను కట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు మహిళాబంధు పేరిట సంబురాలను నిర్వహించడం మహిళలపై సీఎం కేసీఆర్కు గౌరవం కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. సంబురాల్లో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి సతీమణి వాసంతి ఆర్పీలతో కలిసి ఎంపీ రాములుకు రాఖీ కట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్కు ఆర్పీలు, పట్టణ మహిళా నాయకురాళ్లు రాఖీలను కట్టారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.