మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 17: రాబోయే పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, పండుగకు పోలీసు మద్దతు ఉంటుందని తెలిపారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈద్గా దగ్గర ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామన్నారు. సమావేశంలో మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సునీత, సీఐలు సోమ్నారాయణ్సింగ్, రాజేశ్వర్గౌ డ్, మహేశ్వర్రావు, వీరాస్వా మి, ఎస్సై రమేశ్, కౌన్సిలర్ షబ్బీర్ తదితరులు ఉన్నారు.