గద్వాల న్యూటౌన్, జూలై 13 : ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు వక్రమార్గంలో అక్రమార్కులకు చేయూతనిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. పట్టుబడిన బియ్యం కేసులో దాగుడుమూతలు ఆ డారు. చివరకు అధికారిపై క్రిమినల్ కేసు నమో దు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జో గుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న రేఖా రైస్ మిల్లులో గతేడాది అక్టోబర్ 2న 340 సంచులు (170.5 క్వింటాళ్లు) రేషన్ బి య్యాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు సీ జ్ చేశారు. అయితే, పట్టుబడింది రేషన్ బి య్యం కాదని ప్రజాప్రతినిధుల అండతో సివిల్ సైప్లె ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎల్.గణపతి రావు తప్పుడు నివేదికలను రూపొందించారు. కాగా, ఈ కేసులో రాష్ట్ర విజిలె న్స్ అధికారులు మరోసారి విచారణ చేశా రు. సీజ్ చేసిన బియ్యాన్ని ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్) ల్యాబ్లో పరీక్షించి రేషన్ బి య్యంగా నిర్ధారించారు. దీంతో సంబంధి త డీటీ గణపతి రావుపై కేసు నమోదు చే యాలని రాష్ట్ర విజిలెన్స్ కమిటీ జిల్లా సివిల్ సైప్లె అధికారిణి రేవతికి ఆదేశాలు జారీ చేయగా, గత నెల 21న గద్వాల పట్టణ పోలీస్స్టేషన్లో డీటీపై కేసు నమోదైంది. రేఖా రైస్ మిల్లులో విచారణ చేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అప్పటి జేసీ, గద్వాల తాసిల్దార్, రెవెన్యూ, ఆర్ఐ, ఎస్సై లు, సీఐలకు భాగస్వామ్యం ఉన్నట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తున్నది.
విజిలెన్స్ విచారణలో బహిర్గతం..
రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్న వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. గతేడాది అక్టోబర్ 2న బియ్యం పట్టుబడిన క్రమంలో సోదాలు, తనిఖీలు, విచారణ అంశాలపై అదే నెల 5వ తేదీన మూడు బృందాలుగా గద్వాలకు చేరుకొని మిల్లు యాజమాన్యం, పోలీసు, రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను విచారణ చేపట్టారు. వారిచ్చిన అంశాల ను పరిగణలోకి తీసుకొని ఆరా తీయగా.. అంతా తప్పుడు నివేదికలుగా గుర్తించారు. దీంతో డీటీపై కేసు నమోదు చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారుల్లో ఎలాంటి చలనం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గత నెల 21న డీటీపై కేసు నమోదైతే.. ఆ వివరాలను బయటికి పొక్కకుండా రహస్యంగా ఉంచడం చర్చనీయాంశం గా మారింది. చిన్నపాటి సంఘటనలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపే పోలీసులు ఓ అధికారి తప్పుడు నివేదికలను ఇస్తే బయటికి చెప్పకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది.
నెక్ట్స్ ఎవరిపై..?
రేషన్ బియ్యం వ్యవహారంలో డీటీపై క్రిమినల్ కేసు నమోదు కా వడంతో సిబ్బంది హడలెత్తిపోతున్నారు. నెక్ట్స్ ఎవరి పేరు ఉంటుందని ఆరా తీస్తున్నారు. కొందరు ‘పెద్దల’ ఆశీస్సుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు న్యాయవాదులను ఆశ్రయిస్తున్నా రు. కేసు నుంచి బయటపడేందుకు ఇప్పటి నుంచే అడ్డదారులు తొ క్కుతున్నట్లు సమాచారం. ఇన్నాళ్ల సర్వీసులో చేసిన అక్రమాలు సై తం వెలుగులోకి తీసుకొచ్చేందుకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై డీఎస్వో రేవతిని వివరణ కోరేందుకు చరవాణిలో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.