రాజాపూర్, జూలై 13 : విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి గ్రామ సమీపంలోని దుందుభీవాగు పరీవాహక ప్రాం తం, గుట్టల్లో విత్తనబంతులు చల్లారు. అనంతరం గ్రామం లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. పచ్చదనం పెంపుతోనే వర్షాలు సమృద్ధిగా కు రువడంతోపాటు వాతావరణంలో సమతుల్యం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారె డ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీ వో లక్ష్మీదేవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, స ర్పంచ్ అలివేలు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ కాపాడాలి
భూత్పూర్, జూలై 13 : హరితహారంలో నాటే ప్రతి మొ క్కనూ కాపాడాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌ డ్ అన్నారు. మున్సిపాలిటీలోని 1వ వార్డులో కౌన్సిలర్ బాలకోటి ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, మేనేజర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.
విత్తన బంతులతో అటవీశాతం వృద్ధి
మిడ్జిల్, జూలై 13 : విత్తనబంతులతో అటవీశాతం మ రింత వృద్ధి చెందుతుందని ఎంపీపీ కాంతమ్మ అన్నారు. మండలంలోని వెలుగోముల, వాడ్యాల్, మల్లాపూర్, ము న్ననూర్, బోయిన్పల్లి తదితర గ్రామాల్లో విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనబంతులతో సహజసిద్ధంగా మొక్కలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు మంగమ్మ, జంగారెడ్డి, జంగయ్య, నారాయణరెడ్డి, ఏపీఎం రాందాసు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణకు కృషి
కోయిలకొండ, జూలై 13 : మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ మాణిక్యమ్మయాదయ్య తెలిపారు. కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామ సమీపంలోని గుట్టల్లో విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఉపసర్పంచ్ చెన్నమ్మ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
భాగస్వాములు కావాలి
మహబూబ్నగర్ టౌన్, జూలై 13 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని 21వ వార్డు కౌన్సిలర్ ఆనంద్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని బీకే.రెడ్డి కాలనీలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో నాటే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వార్డులోని ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.