నవాబ్పేట, సెప్టెంబర్ 18 : మండలంలోని గురుకుంట, కారుకొండ, సత్రోనిపల్లితండా తదితర గ్రా మాల్లో శనివారం గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురుకుంటలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి హాజరై పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గణేశ్ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్నారు. అలా గే మండలంలోని కారుకొండలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిఇటీ సభ్యులు గ్రామ సమీపంలోని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. సత్రోనిపల్లి తండాలో నిర్వహించిన గణేశ్ విగ్రహాన్ని యువకులు నృత్యాలు చేస్తూ తండా శివారులోని చెరువులో నిమజ్జనం చేశా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ తులసీరాంనాయక్, నా యకులు ప్రతాప్, రవి, శ్రీనివాస్, పురుషోత్తం, రమే శ్, చందర్నాయక్, సేవ్యానాయక్, ప్రతాప్నాయక్, గణేశ్నాయక్, రత్నబాబునాయక్, రాజునాయక్, కిశోర్నాయక్, మహేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 18 : మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో యువత రంగులు చల్లుకొని నృత్యాలు చేశారు. మహిళలు బొడ్డెమ్మ వేశారు. మండలకేంద్రంలో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గణనాథుడికి ప్రత్యేక పూజలు
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : జడ్చర్లలోని కొత్తకేశవులు నగర్కాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుడిని శనివారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, లత, టీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్, పర్మటయ్య, మతీన్, వ్యాస్, తేజ, శరత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అన్నప్రసాదం పంపిణీ
బాలానగర్, సెప్టెంబర్ 18 : మండలకేంద్రంతోపాటు పెద్దాయపల్లి, చెన్నంగులగడ్డతండాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల్లో అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచులు శంకర్, రవినాయక్, పంచాయతీ కార్యదర్శి అనిల్కుమార్, వేణు, నర్సింహ, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 18 : మండలంలోని దోండ్లపల్లి, చొక్కంపేట, రాఘవాపూర్ గ్రామాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, సేవ్యానాయక్, లక్ష్మీదేవి, అభిమన్యు యువసేన సభ్యులు పాల్గొన్నారు.
రూ.36వేలకు గణేశ్ లడ్డూ వేలం
మిడ్జిల్, సెప్టెంబర్ 18 : మండలకేంద్రంలో మణికంఠ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి లడ్డూను వేలం వేయగా, గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ రూ.36వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అలాగే శ్రీరామ ఉత్సవ కమిటీ గణనాథుడికి పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.