పాన్గల్,సెప్టెంబర్18: నిండైనా పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన కొల్లాపూర్ రానున్న కాలంలో రూపురేఖలు మారనున్నాయని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. రేమద్దుల మీదుగా కాశీంనగర్ వరకు దాదాపు 2.6కిలో మీటర్ల దూరాన రూ.2.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అన్నారం, చింతకుంట, ఆకులోనిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారం భించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సింగో టం-గోపల్దిన్నె రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.138కోట్లు మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి రూ.1,200కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను సంఘటితం చేసి చైతన్యం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో 2006 సంవత్సరంలో ఐడీఆర్సెల్ కంపెనీ వారు ఎంజీకేఎల్ఐ కాల్వల నిర్మాణానికి ఒప్పందం చేసుకొని నాసిరకంగా పనులు చేపట్టారన్నారు. గతేడాది కురిసిన వర్షాలకు కాల్వల దెబ్బతిన్నాయని, ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన కాల్వ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. కార్యక్ర మంలో కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా, ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుప తినాయుడు, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు, చంద్రశేఖర్నాయక్, మోడల తిరుపతయ్య, తిరుపతియాదవ్, ప్రసాద్రెడ్డి, అడ్వకేట్ రవికుమార్, సర్పంచులు మంజుల, మేస్త్రీ రాములు, నాగేశ్నాయుడు, లక్ష్మయ్య, ఎంపీటీసీలు కరుణాకర్ రెడ్డి, సుబ్బయ్య, వీరపాగ నాగమ్మ, నాయకులు సొప్పరి వెంకటేశ్, హన్మంతురెడ్డి పాల్గొన్నారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం
గోపాల్పేట, సెపెంబర్ 18 : అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శనివారం ఆయన మండలకేంద్రంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పోస్టాఫీసుకు సొంత భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరగా, స్పందించిన ఆయన పోస్టాఫీసు కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించి నూతన భవన నిర్మాణానికి తమ వంతు సాయాన్ని అందజేస్తామన్నారు. అంతకు ముందు ఆయన టీఆర్ఎస్ నాయకుడు గాజుల కోదండం ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సింగిల్విండో వైస్చైర్మన్ గువ్వల రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్రాజు, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఎండీ. మతీన్, వనపర్తి పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ అభిన్శర్మ, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు మన్యం నాయక్, టీఆర్ఎస్ నాయకులు కోళ్ల వెంకటేశ్, కాశీనాథ్, కోదండం, రవి, నాగరాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.