పెద్దమందడి, సెప్టెంబర్ 18 : దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జగత్పల్లి గ్రామ శివారులోని ఎస్టీ గురకుల పాఠశాల ప్రహరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే గురుకుల పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. మండలంలోని వీరాయపల్లి గ్రామంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్రెడ్డి నివాసంలో ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి వారికి చేయూతనందిస్తున్నదని తెలిపారు. మెట్ట పొలాలకు సైతం సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణలతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ తూడి మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వనపర్తి మార్కె ట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతుబంధు మం డల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సత్యారెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు వేణుయాదవ్, సింగిల్విండో ఉపాధ్యక్షుడు కుమార్యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
తండాలను జీపీలుగా మార్చిన
ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
వనపర్తి,సెప్టెంబర్18: తండాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు బిజినగడ్డ తండాలో రూ. 12లక్షలతో నూతనంగా నిర్మించిన గిరిజన కమ్యూనిటీ హాల్ను గిరిజన మహిళ, అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్లో గిరిజనులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తండా, ప్రజల అభివృద్ధికి కావాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. అంతకుముందు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశా రు. అనంతరం వారితో కలిసి సహపంక్తి టిఫిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాణ్యతగా పనులు చేపట్టాలి
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 18 : గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనులను నాణ్యవంతంగా చేపట్టాలని గిరిజన అభివృద్ది ఉమ్మడి జిల్లా అధికారులు వెంకటేశ్వరసింగ్, చక్రకుమార్లకు మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన కమ్యూనిటీహాల్ను ఆయన ప్రారంభించారు. అలాగే జిల్లా కేంద్రంలోని గృహాకల్ప సమీపంలో ఉన్న గిరిజన వసతి గృహాంలో రూ.38లక్షలతో నిర్మించిన వంటగది, కామన్హాల్, ప్రహరీ నిర్మాణ పనులను పూర్తికాగా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, గిరిజన అభివృద్ధి జిల్లా అధికారిణి యాదమ్మ, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, దేవర్ల నరసింహా, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, ఎల్ఐసీ కృష్ణ, విభూతి నా రాయణ, పాకనాటి కృష్ణయ్య, పుట్టపాకుల మహేశ్, చీర్లసత్యం నాయకులు , గొర్రె ల కాపరుల సంఘం డైరెక్టర్, లబ్ధిదారు లు తదితరులు పాల్గొన్నారు.