కోయిలకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. శనివా రం మండలంలోని పార్పల్లి, అనంతాపూర్, కొత్లాబాద్, కో యిలకొండ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్లాబాద్లో రూ.13లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించడంతోపాటు ఉన్నత పాఠశాలలో రూ.9లక్షలతో నిర్మించే సైన్స్ల్యాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండలకేంద్రంలో 200మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. అలాగే చంద్రాస్పల్లికి చెందిన శోభారెడ్డికి రూ.5లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ, వింజమూర్కు చెందిన అనితకు రూ.16వేల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేస్తున్న ఘనత ము ఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం తో అన్ని గ్రామాలు వందశాతం అభివృద్ధి సాధించాలని సూ చించారు. కార్యక్రమంలో నవోదయ సంస్థ చైర్మన్ ఎస్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు మాణిక్యమ్మయాదయ్య, చరితాదయాకర్రెడ్డి, ఎంపీటీసీ సత్యయ్యగౌడ్, ఆంజనేయులు, నాయకులు రాజేంద్రప్రసాద్గౌడ్, మాధవరెడ్డి, రాజవర్ధన్రెడ్డి, రవి, శ్రీనివాస్రె డ్డి, జగదీశ్వర్రెడ్డి, మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, ఫీల్డ్ అధికారులు నవీన్, రాందాస్, మత్స్యకార సంఘం నాయకులు లవయ్య, రాములు, సత్తయ్య, రామకృష్ణ, శేఖర్ ఉన్నారు.