వంగూరు, సెప్టెంబర్ 18: ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్తో అడ్డంగా సంపాదిస్తున్న దుర్మార్గుడని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలకేంద్రంలో టీఆర్ఎస్ నేతలతో కలిసి విప్ గువ్వల శనివారం విలేకరులతో మాట్లాడారు. అదే ఆర్టీఐని వాడుకుని నీభరతం పడుతామని హెచ్చరించారు. గజ్వేల్ సభలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన నీకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తే సరైన గుణపాఠం చెబుతామన్నారు. దమ్ముంటే మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. చంద్రబాబు బినామీగా తెలంగాణలో వ్యవహరిస్తున్న నీకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. నీ స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికే ఏం చేయలేని నీవు రాష్ర్టానికి ఏం చేస్తావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని, దాన్ని మరింత ముంచుతావని విప్ గువ్వల హితవు పలికారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.