నాగర్కర్నూల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కరోనా నియంత్రణకుగానూ సీఎం కేసీఆర్ ఆదేశంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. కొవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషనే ఉత్తమమైన మార్గం కావడంతో ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేసేలా ఏర్పాట్లు చేశారు. మాస్ వ్యాక్సినేషన్ పేరిట గురువారం నుంచి ప్రతి గ్రా మం, పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రభు త్వ ఆదేశంతో ఎమ్మెల్యేలు, ఇతర మండల స్థాయి ప్రజాప్రతినిధులు సైతం ఇందులో పాల్గొంటూ ప్రజలను ప్రో త్సహిస్తున్నారు. పల్స్ పోలియోను తలపించేలా గ్రామ స్థాయిలో సబ్ సెంటర్ను యూనిట్గా, పట్టణంలో వా ర్డును యూనిట్గా తీసుకొని వ్యాక్సినేషన్ చేపడుతున్నా రు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు బృందాలు ఏర్పా టు చేశారు.
గ్రామ స్థాయిలో ఆశ, అంగన్వాడీ కార్యక ర్త, పంచాయతీ సిబ్బంది.. పట్టణాల్లో ఏఎన్ఎం, ఆశ, మెప్మా సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బందికి అదనంగా అంగన్వాడీ, వీఏవో, బుక్ కీపర్ లేదా సీసీఏలతో కూడి న మరో నలుగురు సహాయకుల బృందం ఉంటుంది. సహాయకుల బృందం ఇంటింటికీ తిరిగి టీకాలు వేయించుకోని ప్రజలను గుర్తించి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికీ స్టిక్కర్లను అతికించనున్నారు. ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందికీ కచ్చితంగా టీకాలు ఇప్పించేలా మండల స్థా యి అధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారికి బాధ్యతలు కేటాయించారు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ఏ ర్పాటు చేయడం గమనార్హం. సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. పదిహేను రోజు ల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
అధికారులతోపాటు ప్రజాప్రతినిధులూ భాగస్వాములు కావాలని సూచించింది. దీంతో ఎమ్మెల్యేలతోపాటు మండల, పట్టణ స్థాయిలోని సర్పంచ్, కౌన్సిలర్, ఎంపీటీసీ వంటి నాయకులూ భాగమవుతున్నారు. కరోనాతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నది. ప్రతి రో జూ వేసే టీకాలను అదే రోజు ఆన్లైన్లో ప్రభుత్వానికి నివేదిస్తారు. పక్షం రోజుల్లో రాష్ట్రంలో కోటి మందికి వ్యా క్సిన్లు వేయించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆ రోగ్య శాఖ ప్రతి రోజూ వ్యాక్సినేషన్ను పర్యవేక్షించనున్నది. మొత్తమ్మీద కరోనాను నియంత్రించేందుకు ఊ ర్లు, పట్టణాల్లో వ్యాక్సినేషన్ వేయించడంతో ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 5,48,700 మందికి గానూ 18 ఏండ్లు దాటిన వారిలో 1,57,180 మందికి మొదటి డోసు వేయగా.. 58,270 మందికి రెండు డోసుల టీకాలు పూర్తయ్యాయి.
ఇప్పటివరకు 28 శాతం పూర్తి..
జిల్లాలో మొదటి విడుతలో 28 శాతం వరకు వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రజల్లో టీకాపై అపోహలు ఉన్నాయి. ఈ పదిహేను రోజుల్లో జిల్లాలో 18 ఏండ్లు దాటిన అందరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశానుసారం జిల్లాలో 254 బృందాలను నియమించి టీకాలు వేస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలి.