భూత్పూర్, సెప్టెంబర్ 16 : టీకాతోనే కరోనా వైరస్ను అంతం చేయొచ్చని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువా రం మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనాతో దేశమంతా అల్లకల్లోలం అవుతుందన్నారు. కరోనాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, డీఎంహెచ్వో కృష్ణ, మున్సిపల్ వైస్చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, డీఐవో డాక్టర్ శంకర్, ప్రో గ్రాం ఆఫీసర్ సంధ్యాకిరణ్మయి, డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్వో రామయ్య, కోఆప్షన్ సభ్యుడు అజీజ్ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కోయిలకొండ, సెప్టంబర్ 16 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. మండలంలో ని పార్పల్లి, కోయిలకొండ ఆరోగ్య ఉపకేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, సర్పంచులు మాణిక్యమ్మయాదయ్య, కృష్ణయ్య, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లప్ప, ఎంపీటీసీ రోజాజగన్, కోఆప్షన్ సభ్యుడు ఖాజా, తాసిల్దార్ ప్రకాశ్, ఎంపీడీవో జయరాం, డాక్టర్ చంద్రశేఖర్, ఉపసర్పంచులు ఖాజా నవాజ్, చెన్నమ్మ పాల్గొన్నారు.
టీకాతోనే వైరస్కు అడ్డుకట్ట
రాజాపూర్, సెప్టెంబర్ 16 : కొవిడ్ టీకాతోనే వైరస్కు అడ్డుకట్ట వేయవచ్చని ఎంపీపీ సుశీల అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని తిర్మలాపూర్, కుచ్చర్కల్, రంగారెడ్డిగూడ గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ ప్రతాప్చౌహాన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, యాదగిరి, రమేశ్నాయక్, విజయ్కుమార్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్పై అపోహలొద్దు
హన్వాడ, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్పై ఎలాంటి అ పోహలు అవసరంలేదని, 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. గురువారం మండలంలోని 9 ఆరోగ్య ఉపకేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, సర్పంచులు సత్యమ్మ, రేవతి, రాములమ్మ, శ్రీదేవి, వసంత తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మిడ్జిల్, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్ను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కాంతమ్మ, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, రాణిపేట, వస్పుల్, కొత్తపల్లి ఆరోగ్య ఉపకేంద్రాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంవో విజయకుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీటీసీ గౌస్, ఎంపీవో అనురాధ, స ర్పంచులు రాధికారెడ్డి, నారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, నిరంజన్, డాక్టర్ వంశీప్రియ, వైద్యసిబ్బంది దేవయ్య, జం గయ్య, నాయకులు బాలు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సిన్తో రక్షణ
మూసాపేట, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్తో వైరస్ బారిన పడకుండా రక్షణ పొందవచ్చని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. ఎంపీపీ గూపని కళావతీకొండయ్యతో కలి సి మూసాపేట రైతువేదికలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమా న్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మూసాపేట సెంటర్లో 65మందికి టీకా వేసినట్లు తెలిపారు. అలాగే జానంపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో 422 మందికి వాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తా సిల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 16 : 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. మున్సిపాలిటీలో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రోజా, షబ్బీర్అహ్మద్, డాక్టర్ రఫిక్ పాల్గొన్నారు.
1130మందికి వ్యాక్సిన్
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 16 : జడ్చర్ల మున్సిపాలిటీలోని 15 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సునీత, అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించగా, ఒక్కరోజే 1130మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, సెప్టెంబర్ 16 : మండలంలోని పలు గ్రా మాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఉడిత్యాల ఆరో గ్య కేంద్రంలో సర్పంచ్ మల్లేశ్యాదవ్ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 16 : అడ్డాకుల మం డలకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాసిల్దార్ కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మా ట్లాడుతూ అడ్డాకులలో 33మందికి, కందూరులో 103, క న్మనూరులో 73, శాఖాపూర్లో 34మందితో కలిపి మొత్తం 243మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, సీహెచ్వో భాస్కర్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 16 : మండలంలో 18ఏం డ్లు నిండిన ప్రతిఒక్కరూ విధిగా కొవిడ్ టీకా వేయించుకోవాలని దేవరకద్ర పీఏసీసీఎస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి అ న్నారు. డోకూర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, సెప్టెంబర్ 16 : మండలంలోని రుద్రారం ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, మండల ప్ర త్యేకాధికారి సుధాకర్, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, వైద్యాధికారి నవీన్కుమార్రెడ్డి, సర్పంచ్ లలితమ్మ, మాజీ ఎంపీపీ శీనయ్య, కృష్ణగౌడ్, రవి పాల్గొన్నారు.