మక్తల్ రూరల్, సెప్టెంబర్ 16 : ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, టీకా వేసుకుంటే ఎటువంటి ప్రమా దం లేదని, వేసుకోకపోతేనే ప్రమాదమని జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. గురువారం మండలంలోని మంథన్గోడ్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ను జెడ్పీ సీఈవో సిద్ధి రామప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గ్రామాల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిం డిన యువతీయువకులు తప్పకుండా టీకా వేయించుకోవాలన్నారు. టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో పావ ని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఇ దిలావుండగా మండలంలోని పస్పుల గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఎంపీపీ వనజ ప్రా రంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ దత్త ప్ప, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తది తరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్పై అపోహలు వద్దు
కృష్ణ, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని డాక్టర్ శ్రీమంత్ అన్నారు. మండలంలోని మూడుమాల, గుడెబల్లూర్, హిందూపూర్ తదితర గ్రామాల్లో టీకా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
టీకా సెంటర్ తనిఖీ
దామరగిద్ద, సెప్టెంబర్ 16 : మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన వ్యాక్సిన్ సెంటర్ను ఎంపీపీ నర్సప్ప పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిం డిన వారందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కో రారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశమ్మ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కరోనాను జయించాలి
మాగనూర్, సెప్టెంబర్ 16 : కరోనాను జయించాలని ఎంపీపీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీడీవో సు ధాకర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొత్తపల్లి, పెగడబండ, వర్కుర్, మందిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పా టు చేసిన టీకా మెగా శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారికి టీ కా ఇవ్వాలని మండల వైద్యాధికారి సూచించారు. వ్యాక్సిన్కు ప్రజలు సహకరించాలన్నారు. మొత్తం 590 మందికి టీకా వేశామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.