ఊట్కూర్, సెప్టెంబర్ 16 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సింగిల్విండో చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నా రు. గురువారం మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే వారికి భవిష్యత్తులో తగిన గు ర్తింపు కల్పిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుగని అభివృద్ధి తెలంగాణలో జరుతున్నట్లు వివరించారు. కా ర్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్గౌడ్, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, టీ ఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి శివరామరాజు, ఎస్సీ సెల్ నాయకుడు ఆర్.హన్మంతు, మైనార్టీ సెల్ నాయకుడు నాసీర్ఖాన్ పాల్గొన్నారు.
పట్టణ అధ్యక్షుడిగా వెంకటేశ్గౌడ్
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా వెంకటేశ్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కల్వాల్ షమిఉల్లా, కార్యదర్శిగా బసిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా మొల్ల నాసీర్, కోశాధికారిగా వెంకటేశ్, ప్రచార కార్యదర్శిగా స్టీఫెన్, కార్యవర్గ సభ్యులుగా సంజప్ప, శ్రావణ్ ఎంపికయ్యారు. కమిటీ స భ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
టీఆర్ఎస్ నూతన కమిటీ
మక్తల్ రూరల్, సెప్టెంబర్ 16 : మున్సిపాలిటీ పరిధిలో ని కొత్త గార్లపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిన్న బాల కిష్టయ్యగౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ నూ తన కార్యవర్గ సభ్యులను పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నా రు. ఉపాధ్యక్షుడిగా కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడాగా శ్రీను, ఉపాధ్యక్షుడిగా ఆంజనేయులు, సభ్యులను ఎన్నుకున్నారు. సభ్యులకు నరసింహాగౌడ్ నియామక పత్రాన్ని అం దజేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.
కమిటీలతో ప్రతిపక్షాలు గల్లంతు..
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 16 : కమిటీల ఏర్పాటుతో ప్రతిపక్షాలు గల్లంతు అయ్యాయని మార్కెట్ కమిటీ చైర్మన్ రా జేశ్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలో 7, 8, 9, 12వ వా ర్డుల్లో వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా మహ్మద్ జాహంగీర్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా నరేశ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఇబ్రహీం, 8వ వా ర్డులో మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా కృష్ణయ్య, యూత్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్చా రి, బీసీ అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా కృష్ణ, 9వ వార్డులో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా బీమయ్య, యువజన కమిటీ అధ్యక్షుడిగా న ర్సింహగౌడ్, ఎస్సీ సెల్ విభాగం నుంచి ఫయాజుల్లా బేగ్, 12వ వార్డులో కౌన్సిలర్ ఇర్ఫానా సుల్తానా ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా గోపాల్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా రాధి క, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా నిజాం, యువజన కమటీ అధ్యక్షుడిగా హుస్సేన్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సం యుక్త కార్యదర్శులు, కోశాధికారులు, ప్రచార కార్యదర్శుల ను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.