నారాయణపేట, సెప్టెంబర్ 16 : గణేశ్ శోభాయాత్ర, ని మజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ చేతన స్పష్టం చేశారు. గురువా రం పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గణేశ్ ఉత్సవ సమితి, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మండపాల నిర్వాహకులు మం చి కండీషన్లో ఉన్న వాహనాలను వినియోగించాలని, ఆ ధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చూడాలని, మద్యం సే వించి శోభాయాత్రలో పాల్గొనరాదని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ మధుసూదన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్సై సైదయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, మత పెద్దలు, మండపాల నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు
పట్టణంలోని ధోబీవాడలో రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వి నాయక మండపాన్ని ఎస్పీ చేతన సం దర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజ లు చేశారు. అలాగే కర్ణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
భక్తిశ్రద్ధలతో…
ఊట్కూర్, సెప్టెంబర్ 16 : వినాయక నిమజ్జనోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ చేతన ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఊట్కూర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాం తి సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ నెల 18న పట్టణంలో జరిగే వినాయక నిమజ్జనోత్సవాన్ని మండపాల ని ర్వాహకులు శాంతి భద్రతలకు విఘా తం కలుగకుండా భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకొని పోలీసుల కు సహకరించాలని కోరారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసుదన్రావు, సీఐ శంకర్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ బాల్రెడ్డి , నాయకులు పాల్గొన్నారు.
శాంతియుతంగా..
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 16 : గణపతి నిమజ్జన వేడుక లు శాంతియుతంగా జరిగేలా చూడాలని వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ నిర్వహించిన కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే, ఎస్పీ చేతన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేశ్ నిమజ్జన వేడుకలు ముగిసే వరకు శాంతియుతంగా అంద రూ కలిసి నిర్వహించాలన్నారు. ముఖ్యంగా యూత్ క్రమ శిక్షణతో మెలుగాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, సీఐ శంకర్, తాసిల్దార్ నర్సింగ్రావు, వినాయక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.