నాగర్కర్నూల్, సెప్టెంబర్ 16 : పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 73మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు. కరోనావంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూస్తున్నారన్నారు. పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హన్మంత్రావు పాల్గొన్నారు.
సీసీరోడ్డు పనులు ప్రారంభం
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.25లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ప్రధాన రహదారి నల్లవెల్లిచౌరస్తాలో డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. అంతకుముందు మండలంలోని గుడిపల్లిలో మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలంయాదవ్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఈశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ బాబూరావు, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్ జక్కా రాజ్కుమార్రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.