నవాబ్పేట, మే 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానున్నదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామా ల్లో గురువారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా కొల్లూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో అదనపు తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. చౌడూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
జంగమయ్యపల్లి, దర్పల్లి గ్రామాల్లో మహిళా సంఘం భవన నిర్మాణాలకు, రుద్రారంలో అదనపు తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అం దజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రుల్లో ఆనందం నింపినట్లు తెలిపారు. అన్నదాతలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లిఖితారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, సర్పంచులు గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, వెంకటేశ్, వెంకట్, లలితమ్మ, గౌసియాబేగం, ఎంపీటీసీలు రాధాకృష్ణ, లక్ష్మీబాయి, గోపీకృష్ణ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, చందర్నాయక్, అబ్దుల్లా, నవనీతరావు, కృష్ణగౌడ్, చౌడూర్ లింబ్యానాయక్, రఘుగౌడ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.