కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీలకు చెల్లుచీటి
అభివృద్ధి వైపు క్యూ కడుతున్న వివిధ పార్టీల నేతలు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారంటే వారు ఆ కుటుంబంలో సభ్యులు అయిపోయినట్లేనని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పార్టీ శ్రేణులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు. కుల మతాల పేరిట రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీలను ప్రజలు ఛీదరించుకుంటున్నారని పే ర్కొన్నారు. దుర్మార్గమైన పార్టీలకు ప్రజలు చెల్లుచీటి ప లుకుతున్నారని అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, సుమారు 500 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ 70 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించిన పార్టీ లు దివాలా తీయించాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో కొందరు కుల మతాల మధ్య గొడవలు సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి పదవులు సంపాదించారని దుయ్యబట్టారు.
అలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్లోకి ఒకసారి వచ్చారంటే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితే ఉండదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని చూస్తేనే పరిస్థితి అర్థం అవుతుందని ఆయనన్నారు. నాడు పాలమూరు అంటేనే వలసలకు ప్రసిద్ధి అని.. ఇప్పుడు ఈ ప్రాంతానికే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఉపాధి పొందేలా అభివృద్ధి జరిగిందన్నారు. మహబూబ్నగర్ నుంచి ఉపాధి కోసం దుబాయి, ముంబయి పోవాల్సిన అవసరం లేదని, ఇప్పుడు స్థానికంగానే ఉపాధి పొందవచ్చని సూచించారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచే సే వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నా రు. పార్టీలో అందరూ సమానమేనని.. ఎవరికి ఏ ఆప ద వచ్చినా అండగా ఉంటామన్నారు. బండమీదిపల్లి, ఏనుగొండ, వీరన్నపేటకు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సుభాష్గౌడ్, బీజేపీ పట్టణ ప్రధా న కార్యదర్శి శ్రావణ్గౌడ్, బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు రా జు, బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి మహేశ్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు వి.సంజీవ, మాజీ ఎంపీటీసీ న ర్సింహులు, జీ.మురళీధర్గౌడ్, రాములు, రవి కు మార్, కృష్ణయ్య, వెంకటయ్య, కన్న, శివాచారి, శ్రీకాం త్ తదితరులు గులాబీ గూటికి చేరారు. సమావేశంలో సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమా ర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ఫ్లోర్ లీడర్ షబ్బీర్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మైనార్టీ నేత ఇంతియాజ్, నాయకులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే ముందున్న లక్ష్యం
మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 8 : పాలమూరు పట్టణాభివృద్ధే తన ముందున్న లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 14వ వార్డు పరిధిలోని వీరన్నపేటలో రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరన్నపేట గతంలో ఎలా ఉండేదో అందరికీ తెలుసు అని అన్నా రు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో మీరే చూస్తారన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్రూంలు నిర్మించామని తెలిపారు. గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పా రు. ఇక్కడి నుంచి పెద్ద రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో వీరన్నపేట రూపురేఖలే మారనున్నాయని పేర్కొన్నారు. సీసీ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మాజీ వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్ అంజయ్య, కోఆప్షన్ సభ్యులు జ్యోతి, రామలింగం, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి శివరాజ్, నాయకులు శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన
మహబూబ్నగర్ రూరల్ మండలంలోని భవానిగడ్డ తండా పంచాయతీలోని బోడబండ తండా నుంచి ఫతేపూర్ వరకు రూ.84 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న తండాలకు సైతం రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జైనల్లిపూర్లో రూ.26 లక్షలతో 90 కేఎల్ మిషన్ భగీరథ ట్యాంక్, అంగన్వాడీ ప్రహరీని మంత్రి ప్రారంభించారు. అలాగే రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, నూతన డ్వాక్రా భవనానికి రూ.15 లక్షలు, పాత తిరుమల హనుమాన్ ఆలయానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ ఏదైనా సాయం కావాలంటే అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, ఎంపీవో నరేందర్రెడ్డి, రాఘవేందర్, పాండురంగారెడ్డి, సర్పంచ్ పూర్య నాయక్, ఎంపీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.