కోయిలకొండ/దేవరకద్ర రూరల్: చుక్కల అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రం శ్రీరామకొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి శనివారం రాత్రి నుంచే భక్తులు శ్రీరామకొండకు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. దాదాపు రెండు గంటల పాటు భక్తులు క్యూలైన్లో నిలబడి రామదర్శం చేసుకొన్నారు.