ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
బాలానగర్, ఏప్రిల్30: వ్యక్తి గత జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరి చేరదని, ఒకవేళ సోకినా ప్రాణాంతకంగా మారదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసమే కొవిడ్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం 17 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్, ఇద్దరికి టీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2 లక్షల చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.